భారత్-యూకే వ్యాపార సంబంధాలను బలోపేతం చేయడంలో విశేష కృషి చేస్తున్న టాటా గ్రూప్ ఛైర్మన్ నటరాజన్ చంద్రశేఖరన్కు బ్రిటిష్ ప్రభుత్వం గౌరవ నైట్హుడ్ను ప్రదానం చేసింది.
దిల్లీలోని బ్రిటిష్ హైకమిషనర్ నివాసంలో జరిగిన కార్యక్రమంలో ఆయనకు ‘నైట్ కమాండర్ ఆఫ్ ది మోస్ట్ ఎక్సెలెంట్ ఆర్డర్ ఆఫ్ ది బ్రిటిష్ ఎంపైర్ (కేబీఈ)’ పురస్కారాన్ని ప్రదానం చేశారు.
‘యూకేలో టాటా గ్రూప్ దీర్ఘకాలంగా పెట్టుబడులు పెడుతోంది. దీని కార్యకలాపాలు వాహన, ఉక్కు, సాంకేతికత, వినియోగదారు రంగాల్లో విస్తరించి ఉన్నాయి.
ఇది యూకేలో ఉద్యోగాలకు, అధునాతన తయారీ రంగానికి, స్వచ్ఛమైన సాంకేతికతల వైపు పరివర్తనకు మద్దతు ఇవ్వడంలో ముఖ్య పాత్ర పోషిస్తోంది.
టాటా గ్రూప్ ఛైర్మన్గా, ఆయన అనేక సంవత్సరాలుగా యూకే-భారత వ్యాపార సంబంధాలకు, బ్రిటన్లో పెట్టుబడులకు విశేష కృషి చేశార’ని హైకమిషన్ తెలిపింది.
బ్రిటన్ రాజు కింగ్ ఛార్లెస్-3 తరఫున బ్రిటిష్ హైకమిషనర్ కామెరాన్ ఈ గౌరవ పురస్కారాన్ని చంద్రశేఖరన్కు ప్రదానం చేశారు.