---Advertisement---
telugujobs.in - 2

తమిళ రచయిత ఆర్‌. వైరముత్తుకు 60వ జ్ఞానపీఠ్‌ పురస్కారం

By: rapolujobs

On: March 15, 2026

వైరముత్తు
www.telugujobs.in
  • ప్రముఖ తమిళ రచయిత మరియు సినీ గీత రచయిత ఆర్‌. వైరముత్తుకు 2025 సంవత్సరానికి సంబంధించిన 60వ జ్ఞానపీఠ్‌ పురస్కారం ప్రకటించారు.
  • దిల్లీలో జరిగిన భారతీయ జ్ఞానపీఠ్‌ పాలక మండలి సమావేశంలో, ప్రొఫెసర్‌ ప్రతిభా రే నేతృత్వంలో సభ్యులు ఏకగ్రీవంగా ఆయనను ఎంపిక చేశారు.
  • వైరముత్తు 1953లో తమిళనాడు రాష్ట్రంలోని తేని జిల్లాలోని మేట్టూర్‌లో జన్మించారు.
  • ఆధునిక తమిళ సాహిత్యానికి విశేష సేవలందించిన ప్రముఖ రచయితగా ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది.
  • కళాశాల విద్యార్థిగా ఉన్న సమయంలో రచించిన ‘వైకరై మేఘంగళ్‌’ అనే కవితా సంకలనం అప్పట్లోనే ఒక మహిళా కళాశాలలో పాఠ్యాంశంగా చేర్చబడింది.
  • రాష్ట్ర ప్రభుత్వ అధికార భాషా కమిషన్‌లో పని చేస్తున్న సమయంలో, 1980లో విడుదలైన ‘నిళల్‌గల్‌’ సినిమాతో ఆయన సినీ గీత రచయితగా ప్రవేశించారు.
  • ఇప్పటివరకు వైరముత్తు 7,500కు పైగా సినీ పాటలు రచించారు.
  • ఉత్తమ గీత రచయితగా ఆయన 7 సార్లు జాతీయ చలనచిత్ర పురస్కారం మరియు 6 సార్లు తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వ అవార్డులు అందుకున్నారు.
  • ఆయన సాహిత్య రంగంలో సుమారు 40 పుస్తకాలు రచించారు.
  • కళ్లికాట్టు ఇతిగాసం, కరువాచ్చి కావియం, తన్నీర్‌ దేశం, మూడ్రం ఉలగపోర్‌ వంటి రచనలు ప్రత్యేకంగా ప్రసిద్ధి పొందాయి.
  • ఆయన రచనల్లో మానవ సంబంధాల సున్నితత్వం, సామాజిక చైతన్యం, ప్రకృతి పట్ల అవగాహన స్పష్టంగా ప్రతిబింబిస్తాయి.
  • ఆయనకు 2003లో పద్మశ్రీ, 2014లో పద్మభూషణ్, సాహిత్య అకాడమీ అవార్డు పలు గౌరవ పురస్కారాలు కూడా లభించాయి.
  • తమిళనాడు ప్రభుత్వం ఆయనకు కళైమామణి పురస్కారం కూడా ప్రదానం చేసింది.
  • తమిళ సాహిత్యం నుండి ఇప్పటివరకు అఖిలన్ (1975), జయకాంతన్ (2002) జ్ఞానపీఠ్ అందుకున్నప్పటికీ, అది వారి నవలా సాహిత్యం కథా రచనలకు దక్కింది. కానీ, తమిళ కవిత్వానికి జ్ఞానపీఠ్ దక్కడం ఇదే తొలిసారి కావడం విశేషం. 
  • జ్ఞానపీఠ్‌ పురస్కారం విజేతకు రూ.11 లక్షల నగదు బహుమతి, సరస్వతి కాంస్య విగ్రహం, మరియు ప్రశంసాపత్రం అందజేస్తారు.

Multiple Choice Questions

2025 సంవత్సరానికి సంబంధించిన 60వ జ్ఞానపీఠ్‌ పురస్కారం ఎవరికీ లభించింది?
A) డి. జయకాంతన్
B) ఆర్‌. వైరముత్తు
C) పీవీ అకిలన్
D) సల్మాన్ రష్దీ
సమాధానం: B

వైరముత్తు మొదట రాసిన కవితా సంకలనం ఏది?
A) కరువాచ్చి కావియం
B) వైకరై మేఘంగళ్‌
C) తన్నీర్‌ దేశం
D) మూడ్రం ఉలగపోర్‌
సమాధానం: B

డి. జయకాంతన్ జ్ఞానపీఠ్‌ పురస్కారం పొందిన సంవత్సరం ఏది?
A) 1998
B) 2000
C) 2002
D) 2005
సమాధానం: C

తమిళనాడు నుంచి జ్ఞానపీఠ్‌ పురస్కారం పొందిన తొలి రచయిత ఎవరు?
A) డి. జయకాంతన్
B) ఆర్‌. వైరముత్తు
C) పీవీ అకిలన్
D) సుభ్రమణ్య భారతి
సమాధానం: C

వైరముత్తుకు పద్మభూషణ్ అవార్డు ఏ సంవత్సరంలో లభించింది?
A) 2012
B) 2014
C) 2016
D) 2018
సమాధానం: B

వైరముత్తుకు పద్మశ్రీ పురస్కారం ఏ సంవత్సరంలో లభించింది?
A) 2001
B) 2003
C) 2005
D) 2010
సమాధానం: B

వైరముత్తు రచించిన ప్రసిద్ధ గ్రంథాల్లో ఏది ఒకటి?
A) కళ్లికాట్టు ఇతిగాసం
B) గీతాంజలి
C) మల్గుడి డేస్
D) దేవదాస్
సమాధానం: A

వైరముత్తు సినీ రంగంలోకి ప్రవేశించిన చిత్రం ఏది?
A) మున్నా
B) నిళల్‌గల్‌
C) అన్నియన్
D) రోబో
సమాధానం: B

ఆర్‌. వైరముత్తు ఏ భాషకు చెందిన రచయిత?
A) తెలుగు
B) కన్నడ
C) తమిళం
D) మలయాళం
సమాధానం: C

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

You cannot copy content of this page